: రెండు వంతెనలకు జయలలిత, ఎంజీఆర్ ల పేర్లు!

తమిళనాడులోని మధురైలో కొత్తగా నిర్మించిన రెండు వంతెనలకు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ ల పేర్లు పెట్టారు. మధురైలోని వైగై నది మీద ఈ రెండు బ్రిడ్జిలను నిర్మంచారు. 2014లో వీటి నిర్మాణం ప్రారంభమైంది. జయ హయాంలో వీటి నిర్మాణం కోసం రూ. 30.47 కోట్లను కేటాయించారు. నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ వంతెనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలను కూడా పళనిస్వామి ప్రారంభించారు. 

More Telugu News