: టీఆర్ఎస్ ఎంపీ కవితను మర్యాదపూర్వకంగా కలిసిన 'పెళ్లి చూపులు' టీమ్

64వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే-డైలాగ్స్ కేటగిరీల్లో రెండు అవార్డులను 'పెళ్లి చూపులు' సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ చిత్ర యూనిట్ టీఆర్ఎస్ ఎంపీ కవితను ఆమె నివాసంలో కలుసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డులను ఈ సందర్భంగా కవితకు వారు చూపించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కుటుంబ కథా చిత్రాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని చెప్పారు. మంచి సినిమాలకు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. చాలా మంచి చిత్రాన్ని నిర్మించారంటూ యూనిట్ సభ్యులకు కవిత అభినందనలు తెలిపారు.

కవితను కలిసిన వారిలో హీరో దేవరకొండ విజయ్, మాధవి, వర్ధన్ దేవరకొండ, డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్, నిర్మాతలు యాష్ రంగినేని, రాజ్ కందుకూరి, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ తదితరులు ఉన్నారు.

More Telugu News