: కశ్మీర్‌ వివాదంపై మేము అలా అనలేదు: చైనా

కశ్మీర్ వివాద అంశం పరిష్కారానికి చైనా సహకరిస్తుందని, భారత్-పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం జరిపేందుకు సిద్ధమని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ అంశంపై స్పందించిన చైనా ఆ వార్త‌ల‌ను ఖండించింది. భార‌త్‌, పాక్‌ ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కశ్మీర్ వివాదానికి ప‌రిష్కారం దొరుకుతుంద‌ని, దీనిపై త‌మ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)కు చైనా భారీగా పెట్టుబడులు పెడుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌లే ఆ దేశ ప‌త్రిక‌ 'గ్లోబల్ టైమ్స్ క‌శ్మీర్ అంశంపై ఇటువంటి క‌థ‌నాన్ని ప్ర‌చురించడంతో చైనా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

భారత్-పాక్ ల‌ మధ్య సంబంధాల మెరుగుకు త‌మ దేశం నిర్మాణాత్మక పాత్ర మాత్ర‌మే పోషించ గలదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ అన్నారు. క‌శ్మీర్ అంశంపై మాత్రం పాక్, భార‌త్‌లు చ‌ర్చించుకొని శాంతియుత ప‌రిష్కారం క‌నుగొనాల‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News