: ఐదు నెలల్లో లక్ష కిలోమీటర్ల పర్యటన.. సుడిగాలి పర్యటనలకు సిద్ధమైన అమిత్ షా

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. రానున్న ఐదు నెలల్లో దేశ వ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల మేర సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటనలు సాగనున్నాయి. నెలకు దాదాపు 20 వేల కిలోమీటర్ల మేర పర్యటించేలా షా పర్యటన ఉండబోతోంది. ఈ పర్యటనల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించనున్నారు.

అమిత్ షా పర్యటన చాలా టైట్ గా ఉండబోతోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి కూడా ఆయన హజరుకాకపోవచ్చని అంటున్నారు. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

More Telugu News