: ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేష్

ఆంధ్రపదేశ్ లో ఐటీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న మేథా టవర్స్ లో ఏడు ఐటీ కంపెనీలు నేటి నుంచి కార్యకలాపాలను మొదలు పెట్టాయి. ఈ కంపెనీలలో మొత్తం 1,650 మందికి పైగా ఉద్యోగులు పని చేయనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ కంపెనీలను ప్రారంభించారు.

కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీలలో స్పెయిన్ కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందుసాఫ్ట్, ఈసీ సాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్స్ ఉన్నాయి. మరిన్ని ఐటీ కంపెనీల కోసం ఈ భవనం పక్కనే మరో భారీ భవనాన్ని నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది.

More Telugu News