: కియా వచ్చేసింది... ఇక యాపిల్ పైనే చంద్రబాబు దృష్టి!

నవ్యాంధ్రను పారిశ్రామికంగా, ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో, తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియాను ఏపీకి రప్పించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ సంస్థ తన తయారీ యూనిట్ ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఎంతో జోష్ గా ఉన్న చంద్రబాబు... ఇప్పుడు టెక్ దిగ్గజం యాపిల్ పై దృష్టి సారించారు.

ఈ విషయంలో ఆయన ఓ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం. తన అమెరికా పర్యటనలో యాపిల్ సంస్థను తిరుపతికి తీసుకురావడమే చంద్రబాబు ప్రథమ లక్ష్యంగా ఉండబోతోంది. ఇందులో భాగంగా యాపిల్ సీఈవోతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. గూగుల్ యాజమాన్యంతో కూడా చంద్రబాబు భేటీ అవుతారు.

More Telugu News