: కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకోవద్దు.. సైలెంట్ గా ఉండండి: పళనిస్వామి ఆదేశం

కేంద్ర ప్రభుత్వం ఎంత బలమైందో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామకి బాగా అర్థమయింది. కేంద్రంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడరాదంటూ తన మంత్రులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు గంటల పాటు జరిగిన తమిళనాడు కేబినెట్ మీటింగ్ లో ఆయన ఈ మేరకు జాగ్రత్తలు చెప్పారు. కేంద్రంతో కయ్యం ఎంత మాత్రం మంచిది కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్నేహంగా మెలుగుతూ, పనులు చక్కబెట్టుకుందామని తన సహచరులకు చెప్పారు. కేంద్రం అండలేకపోతే... ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా రాదని స్పష్టం చేశారు.

More Telugu News