: శామ్ సంగ్ ఎస్8 ప్లస్ మొబైల్ ను ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్, మన్నారా చోప్రా

శామ్ ‌సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎస్ 8 ప్లస్ మొబైల్ మార్కెట్ లోకి వచ్చేసింది. హైదరాబాదులో నిన్న శామ్ ‌సంగ్ ఎస్ 8 ప్లస్ లాంచింగ్ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ లాంచింగ్ కార్యక్రమంలో టాలీవుడ్ మెగా ఫ్యామిలీ యువ నటుడు సాయిధరమ్ తేజ్, వర్థమాన నటి మన్నారా చోప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్ ను వీరిద్దరూ లాంచ్ చేశారు. అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ తో వారిద్దరూ సెల్ఫీలు దిగి ఆకట్టుకున్నారు. శామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉందని, సరికొత్త ఫీచర్లతో రూపొందిన ఎస్ 8 ప్లస్ మోడల్ అందర్నీ ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

More Telugu News