: ‘విశాఖ’లో స్వైన్ ఫ్లూ .. ఒక్కరోజే 8 కేసుల నమోదు!

విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కేవలం, ఈ రోజే 8 కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. కాగా, ఈ నెల 1, 2 తేదీల్లో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య 11గా ఉంది. వీరు ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల రక్తనమూనాలు సేకరించి తిరుపతిలో స్విమ్స్ కు, ముంబయిలోని ఎస్ఆర్ఎల్ లేబొరేటరీలకు పంపగా ‘స్వైన్ ఫ్లూ’గా తేలినట్టు సమాచారం.

More Telugu News