: దిగ్విజయ్ కు అప్పుడప్పుడు మైండ్ పనిచేయదు: మంత్రి నాయిని

తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై మంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లేనని, ఆ పార్టీ నేత దిగ్విజయ్ కి అప్పుడప్పుడు మైండ్ పని చేయదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని, చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 2014లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవాలని అనుకున్నామని, అయితే, జైరాం రమేష్, దిగ్విజయ్ వల్లే పొత్తు కుదరలేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోవడానికి ముఖ్యకారకులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగేనని ఆరోపించారు.

More Telugu News