: గుంటూరు జిల్లాలో టీడీపీ సర్పంచ్ దారుణహత్య!

గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని వేమవరం టీడీపీ సర్పంచ్ శ్రీనివాసరావు దారుణహత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు నిద్రిస్తున్న శ్రీనివాసరావును నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News