: అబద్ధాలు చెప్పే పుసక్తం కావాలని అడిగితే.. టీడీపీ మేనిఫెస్టో ఇస్తారు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సెటైర్

అబద్ధాలు చెప్పే పుస్తకం కావాలని ఏదైనా షాపులో అడిగితే .. టీడీపీ మేనిఫెస్టో ఇస్తారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. గుంటూరులో జరుగుతున్న ‘రైతు దీక్ష’ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాల హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా కాకుండా ఈవెంట్ మేనేజర్ గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు గతంలో చేసిన పాదయాత్రలు ఇప్పుడు కనుక చేస్తే ప్రజల ఛీత్కారాలు తప్పవని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News