: నన్ను, నా కుటుంబ సభ్యులని చంపేస్తామని పోలీసులు బెదిరించారు: సత్యంబాబు

తనను, తన కుటుంబాన్ని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించిన కారణంగానే ఆయేషా మీరాను హత్య చేసినట్టు నాడు ఒప్పుకున్నానని సత్యంబాబు ఆరోపించాడు. హైదరాబాద్ వచ్చిన సత్యం బాబు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ‘ఆయేషా మీరాను హత్య చేసినట్టు ఒప్పుకోమని పోలీసులు నన్ను చిత్రహింసలు పెట్టినా నేను ఒప్పుకోలేదు. కానీ, మా అమ్మను, చెల్లెలిని చంపుతామని, నన్ను ఎన్ కౌంటర్ చేస్తామని పోలీసులు అనడంతో.. దానికి భయపడి.. వాళ్లు ఏ విధంగా చెప్పమంటే .. ఆ విధంగా మీడియా ముందు ఆ రోజు చెప్పాను.

నా మాటలను పోలీసులు రికార్డు చేసి కోర్టుకు సమర్పించారు. అయితే, అన్నీ పరిశీలించిన కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది’ అని సత్యంబాబు చెప్పాడు. కాగా, సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో కలకలం సృష్టించిన బీ ఫార్మసి విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు ఇటీవల తుది తీర్పు వెలువరించి, సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించిన సంగతి విదితమే. 

More Telugu News