: రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి వెళ్తున్న బస్సు బోల్తా.. ఇరవై మంది పరిస్థితి విషమం!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనే ర్యాలీకి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పిన సంఘటనలో 35 మంది గాయపడ్డారు. గుజరాత్ లోని నర్మద జిల్లాలోని దేడియపడాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బయలు దేరిన బస్సు తపీ జిల్లాలోని కంజా గ్రామం సమీపంలో మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను బద్రోలి ప్రభుతాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

More Telugu News