: ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి డబ్బు లివ్వను, బ్రాందీ ఇవ్వనన్నా కుదరదు: మంత్రి సోమిరెడ్డి

గత ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలవడానికి కారణాలు ఏంటని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని ఓ న్యూస్ ఛానెల్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజులు పోయాయని, ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి పోటీ చేసి.. తాను డబ్బులు ఇవ్వననో లేకపోతే బ్రాందీ ఇవ్వననో అని అంటే గెలిచే పరిస్థితులు లేవని, ప్రస్తుతం ఎన్నికల ఖర్చు తప్పదని అన్నారు.

తమ ప్రాంతంలో ఓటు బ్యాంకు డిఫరెంట్ గా ఉందని, ప్రో-కాంగ్రెస్, ప్రో-జగన్ ఉన్నారని అన్నారు. తాను ఓడినా, గెలిచినా తన లైఫ్ స్టైల్ లో తేడా ఉండదని, ప్రతిపక్షంలో దేనిమీద అయితే పోరాడానో, అధికారంలోకి వచ్చాక వాటిని కరెక్ట్ చేస్తానని, 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నా, పార్టీ ఒత్తిడి మేరకు పోటీ చేయాల్సి వచ్చిందని, ఉప ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే పోటీ చేయాల్సి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా సోమిరెడ్డి చెప్పారు.

More Telugu News