: రైతులారా! రేపు, ఎల్లుండి మిర్చి తీసుకురావద్దు: గుంటూరు యార్డు చైర్మన్ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డుకు రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా ప్రకటించామని యార్డు చైర్మన్ సుబ్బారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లో రైతులు మిర్చి తీసుకువచ్చినా అనుమతించమని, ఇప్పటికే వచ్చిన మిర్చితో యార్డు పూర్తిగా నిండిపోయిందని అన్నారు. జూన్ 30 వరకు మిర్చికి అదనపు ధర పథకం ఉంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

More Telugu News