: మోసుల్‌లో ఉగ్రవాదుల బాంబు దాడి.. అమెరికా సర్వీస్ మెంబర్ దుర్మరణం

ఇరాక్‌లోని మోసుల్‌లో జరిగిన బాంబు దాడిలో అమెరికా సర్వీస్ మెంబర్ ఒకరు మృతి చెందినట్టు పెంటగాన్ తెలిపింది. శనివారం రాత్రి మోసుల్‌లో ఉగ్రవాదులు జరిగిన బాంబుదాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పేర్కొంది. కాగా, మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు నడుం బిగించిన ఆర్నెల్లలో అమెరికా మిలటరీ అధికారి చనిపోవడం ఇది రెండోసారి. ఇరాక్ కుర్దిష్ ఫైటర్స్ (పెష్‌మెర్గా)కు సలహా ఇచ్చే బృందంలో సభ్యుడైన ఫినాన్ ఈ దాడిలో మృతి చెందారు.

More Telugu News