: చూస్తున్నారుగా... ఇక గంభీర్ ను టీమ్ లోకి తీసుకోండి: గంటగంటకూ పెరుగుతున్న డిమాండ్

ప్రస్తుత ఐపీఎల్ సీజనులో భారత క్రికెట్ జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లూ ఆడుతుండగా, అత్యధిక పరుగులు చేసింది మాత్రం జట్టులో స్థానం లేని గౌతమ్ గంభీర్. కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఇప్పటివరకూ 9 మ్యాచ్ లు ఆడిన గంభీర్, 376 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతుండగా, భారత క్రికెట్ జట్టులోకి అతన్ని తిరిగి తీసుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. 'బ్రింగ్ బ్యాక్ జీజీ' అంటూ ఓ హ్యాష్ టాగ్ హల్ చల్ చేస్తుండగా, దానికి లైకుల సంఖ్య వందల నుంచి వేలు దాటి, లక్షల్లోకి చేరింది. త్వరలో ఇంగ్లండులో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ ను తీసుకోవాలని ఆయన అభిమానులు బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News