: హైదరాబాద్ ను చూసేందుకు ఒంటరిగా వచ్చిన విద్యార్థినిపై నృత్య దర్శకుడి మిత్ర బృందం గ్యాంగ్‌రేప్‌

హైదరాబాద్ లో పర్యటించాలని, నగరమంతా తిరిగి ఇక్కడి అందాలను చూడాలని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఓ విద్యార్థిని దారుణంగా మోసపోయింది. ఎయిర్ పోర్టులో తానూ ఓ టూరిస్టునని చెప్పిన పింకీ అనే యువతి చెప్పిన మాయమాటలు నమ్మినందుకు గ్యాంగ్ రేప్ కు గురైంది. ఈ ఘటన నగర పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బీకామ్‌ విద్యార్థిని అయిన బాధితురాలికి ఎయిర్‌ పోర్టులో పింకీ పరిచయం అయింది. తనతో వస్తే హైదరాబాద్‌ మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పింది.

ఆపై వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్‌మెంటుకు తీసుకెళ్లింది. అక్కడ పింకీ స్నేహితుడు, నృత్య దర్శకుడిగా పనిచేస్తున్న ప్రీత్ సెర్గిల్, మరో నలుగురితో కలసి ఆమెపై లైంగిక దాడులకు దిగాడు. మూడు రోజుల అనంతరం, తనకు దొరికిన టిష్యూ పేపర్ పై అక్కడ జరుగుతున్న విషయాన్ని రాసి, కిటికీ నుంచి బయటకు విసిరేయడంతో, దాన్ని చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు, కొరియోగ్రాఫర్ ప్రీత్‌ సెర్గిల్‌ ను అరెస్ట్ చేశారు. పింకీ సహా మిగతావారు పారిపోయారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.

More Telugu News