: చంద్ర‌బాబుతో మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, అఖిలప్రియ భేటీ.. నంద్యాల ఉప ఎన్నికపై ఒక మెట్టు దిగిన భూమా, శిల్పా వర్గీయులు

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవ‌రిని దించాల‌నే అంశంపై మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, నారాయ‌ణ‌ ఈ రోజు మంత్రి అఖిల‌ప్రియతో చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. అనంత‌రం వారంతా క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఇంటికి వెళ్లారు. క‌ళా వెంక‌ట్రావుతో చ‌ర్చ‌ల ఫ‌లితంగా భూమా, శిల్పా వ‌ర్గీయులు చెరో మెట్టు దిగారు. నంద్యాల అభ్య‌ర్థి అంశంపై నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబుకే వ‌దిలేస్తున్న‌ట్లు ఇరువురూ ప్ర‌క‌టించారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా అంతా క‌లిసే పార్టీ కోసం ప‌నిచేస్తామ‌ని అన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుతో వారు చ‌ర్చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏ నిర్ణ‌యం తీసుకుంటారోనన్న ఆస‌క్తి నెల‌కొంది.

More Telugu News