: బిస్కెట్ ప్యాకెట్ కోసం వెళితే బాలుడికి కరెంట్ షాక్.. అక్కడికక్కడే మృతి!
ఆదిలాబాద్ జిల్లా జనానరం మండలం తిర్మన్గూడలో విషాదం చోటుచేసుకుంది. పైకప్పు రేకుపై పడిన బిస్కెట్ ప్యాకెట్ను తీసుకునే క్రమంలో విద్యుత్ షాక్కు గురైన ఓ 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... నరేశ్ అనే బాలుడు మార్కావరి లక్ష్మి, గంగన్న దంపతుల కుమారుడు. తన సోదరుడు రాజేశ్(12) తో ఈ రోజు ఉదయం టీ, బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని డాబాపైకి వెళ్లాడు. వీరిరువురూ బిస్కెట్ ప్యాకెట్ ను ఒకరి చేతిలోంచి మరొకరు లాక్కుంటూ ఆడుకున్నారు. అయితే, బిస్కెట్ ప్యాకెట్ ఒక్కసారిగా డాబా ముందరి రేకులపై పడిపోయింది. దానిని తీసుకునేందుకు వెళ్లి రేకులపైకి దిగాడు నరేశ్. అయితే సర్వీస్ తీగ తెగి రేకులను తాకి ఉండడంతో నరేశ్ కరెంట్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. నరేశ్ను కాపాడే క్రమంలో రాజేశ్ కి కూడా గాయాలయ్యాయి.