: తమిళ నటుడు, రచయిత విను చక్రవర్తి మృతి

తమిళ సీనియర్ నటుడు, రచయిత విను చక్రవర్తి (71) మృతి చెందారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన సుమారు 1000 చిత్రాల్లో నటించారు. అయితే, తమిళ సినిమాల్లోనే ఆయన ఎక్కువగా నటించారు. కథా రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన ఆయన, ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టన కనగల్ వద్ద పని చేశారు.

1977లో ‘పరసంగడ గెండెటిమ్మ’అనే కన్నడ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ తర్వాత, తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటులు జెమినీ గణేశన్, రజనీకాంత్, కమల హాసన్ నటించిన చిత్రాల్లో ఆయన నటించారు. రెండేళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘వాయ మూడి పెసవం’లో ఆయన చివరి సారిగా నటించారు. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే.. నటి సిల్క్ స్మితను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో విను చక్రవర్తికి కీలక పాత్ర పోషించారు.

More Telugu News