: సుక్మా అమర జవాన్ల కుటుంబాలను ఆదుకుందాం రండి.. పిలుపునిచ్చిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్

ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన మావోల దాడిలో అమరులైన 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రావాలంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పిలుపునిచ్చాడు. దేశం కోసం ప్రాణాలిచ్చిన జవాన్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నాడు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ ఓ ఆడియో మెసేజ్‌ను విడుదల చేశాడు.

దేశం కోసం ప్రాణాలర్పించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నిజంగా శ్రద్ధాంజలి ఘటించాలని భావిస్తే ప్రభుత్వ వెబ్‌సైట్ ‌"bha-rat-ke-vee-r.-go-v.-in ద్వారా ఆర్థిక సాయం అందించాలని అందులో కోరాడు. వారికి  సాయం అందించి ఈ విషాద సమయంలో మనమంతా వారివెంట ఉన్నామని నిరూపిద్దామని పేర్కొన్నాడు. అక్షయ్ కుమార్ చొరవతో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌ను గత నెల 9న కేంద్ర హోంమత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.

More Telugu News