: కేజ్రీవాల్ కు షాక్... ఆప్ పంజాబ్ చీఫ్ రాజీనామా

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్ర ఆప్ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ కు పంపించానని ఆయన ప్రకటించారు. ఆయనతో పాటు పంజాబ్ రాష్ట్ర  కో అబ్జర్వర్ దుర్గేష్ పాఠక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పొందడంతో... ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. కీలక నేతలు పలువురు పార్టీకి రాజీనామా చేశారు.


 

More Telugu News