: వినోద్ ఖ‌న్నా మృతికి సంతాపం.. బాహుబ‌లి-2 ప్రీమియర్ షో ర‌ద్దు: క‌ర‌ణ్ జొహార్

కేన్సర్‌తో బాధ‌ప‌డుతూ కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ న‌టుడు, నిర్మాత వినోద్ ఖన్నా ఈ రోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఈ క్రమంలో, ఈ రోజు రాత్రి ప్ర‌ద‌ర్శింప‌త‌ల‌పెట్టిన బాహుబ‌లి-2 ప్రీమియర్ షోను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. బాహుబ‌లి టీమ్ అంతా వినోద్ ఖ‌న్నా మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  


More Telugu News