: ప్రముఖ సినీ దర్శకుడు విశ్వనాథన్ మృతి

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు ఎన్.కే.విశ్వనాథన్ మృతి చెందారు. మంగళవారం రాత్రి 7.30 నిమిషాలకు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కడల్ మీన్ గల్, మీన్ డుమ్ కోకిల, సగాదేవన్ మగాదేవన్ వంటి సినిమాలకు కెమెరామెన్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత దర్శకత్వ బాద్యతలను చేపట్టారు. నమితం, పెరయమరుదు, జగన్మోహిని, ఇనైంద కైగల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోరూరులోని శ్మశానవాటికలో ఆయన పార్థివదేహానికి నిన్న అంత్యక్రియలు జరిగాయి. కమలహాసన్, సత్యరాజ్, పాండ్యరాజన్, ఆర్కే సెల్వమణి, విజయకాంత్ తదితరులు ఆయనకు అంజలి ఘటించారు.  

More Telugu News