: సైనిక శిబరంపై దాడికి దిగిన ఉగ్రవాదులు... మేజర్, ఇద్దరు జవాన్లతో పాటు ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్ముకశ్మీర్‌ లో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కుప్వారా జిల్లా పంజ్‌ గామ్‌ లోని సైనిక శిబిరంపై ఒక్కసారిగా టెర్రరిస్టులు దాడికి దిగారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో అప్రమత్తమయ్యేలోపు మేజర్‌ తో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. అయితే వేగంగా స్పందించి ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News