: ఐఐటీ, ఏఎంయూ, డీయూ వెబ్ సైట్లను హ్యాక్ చేసిన పాక్

ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీ, ఐఐటీ ఢిల్లీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ వెబ్ సైట్లను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. పాకిస్థాన్ రైల్వేస్ వెబ్ సైట్ ను ఇండియన్ హ్యాకర్ హ్యాక్ చేసినందుకు ప్రతీకారంగా ఈ పని చేసినట్టు  'పాకిస్థాన్ హాక్సర్స్ క్రూ' ప్రకటించుకుంది. కాశ్మీరులోని ప్రజలపై భారత సైన్యం మారణకాండను సాగిస్తోందని మెసేజ్ ని పెట్టి, పాక్ రాక్ బ్యాండ్ 'జీస్ట్' సౌండ్ ట్రాక్ ను వెబ్ సైట్ కు యాడ్ చేశారు. కశ్మీర్లో భారత సైన్యం అనుమానితులను రోడ్డుపై కొడుతున్న దృశ్యాలను పోస్టు చేశారు. తల్లీ, చెల్లి అని కూడా చూడకుండా జవాన్లు అత్యాచారాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. కాశ్మీరులో భద్రత కేవలం ఊహ మాత్రమేనని అన్నారు. కాగా, వెబ్ సైట్ల హ్యాకింగ్ విషయాన్ని తెలుసుకున్న సాంకేతిక నిపుణులు తిరిగి వాటిని సరిదిద్దారని అధికారులు ప్రకటించారు.

More Telugu News