: ఢిల్లీలో ఎవరికీ అందనంత ఎత్తున బీజేపీ... పెరిగిన కాంగ్రెస్ బలం!

గడచిన పదేళ్ల నుంచి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గద్దెనేలుతున్న భారతీయ జనతా పార్టీ, ముచ్చటగా మూడోసారి అధికారానికి చేరువైంది. ఈ ఉదయం నుంచి మూడు కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు చురుకుగా సాగుతుండగా, మూడింటిలో ఘనమైన మెజారిటీ దిశగా బీజేపీ పరుగులు పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఉత్తర ఢిల్లీ పరిధిలోని 104 స్థానాల్లో 101 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 65, కాంగ్రెస్ 17, ఆప్ 14, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. తూర్పు ఢిల్లీ పరిధిలో 64 స్థానాలకు గాను 63 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, బీజేపీ 42, ఆప్ 11, కాంగ్రెస్ 7, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఇక దక్షిణ ఢిల్లీ విషయానికి వస్తే, 104 స్థానాలకు గాను 102 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 63, ఆప్ 18, కాంగ్రెస్ 13 చోట్ల విజయం సాధించగా, ఇతరులు 8 చోట్ల గెలిచారు.

More Telugu News