: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా... మూడో స్థానానికి పతనమైన ఆప్!

ఎన్నికల విశ్లేషకులు, పోల్ సంస్థలు ఊహించినట్టుగానే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమై, మూడో స్థానానికి పరిమితం కాగా, కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది. మూడు నగరపాలక సంస్థల్లోని 272 స్థానాలకు గాను, ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో 270 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఉదయం నుంచి ఎన్నికల లెక్కింపు ప్రారంభం కాగా, ఉత్తర ఢిల్లీ పరిధిలో బీజేపీ 69, కాంగ్రెస్ 17, ఆప్ 15, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దక్షిణ ఢిల్లీలో బీజేపీ 74, కాంగ్రెస్ 15, ఆప్ 14, ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో బీజేపీ 39, కాంగ్రెస్ 13, ఆప్ 10, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఫలితాల సరళిని గమనిస్తుంటే, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ను బీజేపీ మరోసారి చేజిక్కించుకోవడం ఖాయమని భావించవచ్చు.

More Telugu News