: రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ మహేందర్‌రెడ్డి

రేప‌టి నుంచి మూడు రోజుల పాటు ఉస్మానియా యూనివ‌ర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల‌ ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. రాష్ట్రపతి హైద‌రాబాద్‌కు రానున్న నేప‌థ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన‌ట్లు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.. బేగంపేట, రాజ్‌భవన్‌, తార్నాక, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయ‌ని, ప్రజలు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన మార్గాల గుండా వెళ్లాలని ఆయన చెప్పారు.

More Telugu News