: ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటి?.. రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారే: సుబ్రహ్మణ్య స్వామి

రాష్ట్రపతి ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆ ప‌ద‌వి రేసులో ఎవ‌రిని దింపుతుంద‌నే అంశంపైనే ఇప్పుడు విప‌రీతంగా చ‌ర్చ కొన‌సాగుతోంది. తాజాగా ఈ అంశంపై స్పందించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి... గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారని అన్నారు. ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటి? అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. తాను కూడా గుజరాత్‌ అల్లుడినే క‌దా? అని ఆయ‌న అన్నారు.


More Telugu News