: నేడు పోలీసుల ముందుకు వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి
వైసీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధుసూదన్ రెడ్డి నేడు తుళ్లూరు (అమరావతి) పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. శాసనమండలిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో, నేడు ఆయన తుళ్లూరు పోలీసుల ముందు హాజరవుతున్నారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ తో ఈయనకు ఉన్న సంబంధాల గురించి పోలీసులు విచారణ జరపనున్నారు.