: సీఎం చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితోనే ముందుకెళ్లాం: ఏపీ డీజీపీ సాంబశివరావు

ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీఆర్ చిట్స్ బాధితులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, బాధిత డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశం, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ కేసు విషయమై ముందుకు వెళ్లామని అన్నారు. ప్రత్యేక కోర్టు సమక్షంలో వీఆర్ చిట్స్ ఆస్తులు వేలం వేశామని, తద్వారా రూ.26 కోట్లు వచ్చాయని అన్నారు. అగ్రిగోల్డ్, అభయా గోల్డ్, బొమ్మరిల్లు సంస్థల బాధితులకూ త్వరలో న్యాయం చేస్తామని సాంబశివరావు తెలిపారు.

More Telugu News