: రెండు నెలల తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి పన్నీర్ వర్గం.. సాయంత్రం కీలక ప్రకటన!

అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనం నేపథ్యంలో చర్చలు జరిపేందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నేడు (సోమవారం) అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనుంది. పార్టీ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టుకున్న రెండు నెలల తర్వాత తొలిసారిగా పన్నీర్ వర్గం నేడు ఈ కార్యాలయంలో  అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా విలీనంపై ఇరువర్గాలు చర్చించనున్నాయి. గత కొన్ని రోజులుగా నానుతున్న ఈ వ్యవహారానికి నేడు ముగింపు పలకాలని ఇరు వర్గాలు గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఇరు వర్గాలు కలిసి కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

More Telugu News