: సోదరుడైనా.. ఎవరైనా ఒకటే.. గెలుపొందే వారికే టికెట్: శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో తాను మధ్యవర్తిని మాత్రమేనని ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘సోదరుడైనా..ఎవరైనా ఒకటే..గెలుపొందే వారికే టికెట్ ఇస్తారు. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం సర్వే చేస్తుంది. నాలుగు రోజుల్లో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు. కాగా, నంద్యాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే పోటీ చేసేందుకు అటు భూమా కుటుంబీకులు, ఇటు శిల్పా మోహన్ రెడ్డి ఉత్సాహం కనబరుస్తున్న విషయం విదితమే. ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే టీడీపీకి శిల్పా మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పి, వైఎస్సార్సీపీలో చేరతారనే వార్తలు వెలువడటం, ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో శిల్పా సోదరులు భేటీ కావడం తెలిసిందే. 

More Telugu News