: మా టీమ్ లో శ్రుతి హాసన్ బిజీ ఆర్టిస్ట్: కమలహాసన్

ప్రముఖ నటుడు కమలహాసన్ కొన్ని నెలల క్రితం తన ఇంట్లో మేడ మెట్లు దిగుతూ గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకున్న కమల్, తన తాజా చిత్రం ‘శభాష్ నాయుడు షూటింగ్ పై దృష్టి పెట్టారు. అయితే, మిగిలిన ఆర్టిస్టులు ఆయనకు అందుబాటులో ఉంటున్నప్పటికీ, ప్రముఖ నటి, తన కూతురు శ్రుతిహాసన్ మాత్రం అందుబాటులో లేదట. ఎందుకంటే, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సంఘమిత్ర’ చిత్రం కోసం కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటూ, ప్రస్తుతం లండన్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో కమల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ టీమ్ అందరిలో శ్రుతిహాసన్ బిజీ ఆర్టిస్ట్ అని, అదృష్టవశాత్తు తాను తండ్రిని కావడంతో తన సినిమాకు ప్రాముఖ్యత ఇస్తుందని అనుకుంటున్నానని అన్నారు. తన చిత్రాన్ని కొన్ని వారాలు ఇండియాలో, మరికొన్ని వారాలు విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉందని, ఆగస్టు నాటికి ‘శభాష్ నాయుడు’ చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నట్టు కమల్ తెలిపారు. 

More Telugu News