: మే 13న మూడో ప్రపంచ యుద్ధం.. జోస్యం చెప్పిన 'అతీంద్రియ శక్తుల' మిస్టిక్!

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని జోస్యం చెప్పిన మిస్టిక్ హొరాసియో విల్లెగాస్ ఈసారి పెద్ద బాంబు పేల్చాడు. వచ్చే నెలలో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందని, ట్రంపే దీనికి నాంది పలుకుతారని చెప్పి కలకలం రేపాడు. టెక్సాస్‌కు చెందిన మిస్టిక్ తనకు అతీంద్రియ శక్తులు ఉన్నట్టు చెప్పుకుంటారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కానున్నారని 2015లో జోస్యం చెప్పిన ఆయనపై చాలామందికి గురి ఉంది. దీంతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మిస్టిక్ చెప్పిన దాని ప్రకారం.. మే 13న డొనాల్డ్ ట్రంప్ ద్వారా మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఫాతిమా మాత 1917లో పోర్చుగల్‌ను సందర్శించారని, ఇది జరిగి వందేళ్లయిన సందర్భంగా ఈ ఏడాది మే 13న యుద్ధం ప్రారంభమై అక్టోబరు 13న ముగుస్తుందని వివరించాడు. ట్రంప్ తొలుత సిరియాపై దాడి చేస్తారని, ఇది రష్యా, ఉత్తరకొరియా, చైనాతో ఘర్షణకు దారి తీస్తుందని పేర్కొన్నాడు. ఫలితంగా మూడో ప్రపంచం యుద్ధం జరుగుతుందన్నాడు. ఇటీవల తనకు ఓ కల వచ్చిందని, అగ్ని గోళాలు ఆకాశం నుంచి భూమిని తాకుతున్నట్టు అందులో ఉందని  మిస్టిక్ పేర్కొన్నాడు. అది తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమేనని తెలిపాడు. ఈ యుద్ధంతో భారీ వినాశనం తప్పదని, మానవాళికి అపారనష్టం కలుగుతుందని మిస్టిక్ ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News