: భయపడక్కర్లేదు.. వీఐపీల భద్రతను తగ్గించం: వెంకయ్య

దేశంలో ఉన్న ప్రజలంతా వీఐపీలే అంటూ వీఐపీల కార్లపై ఎర్రబుగ్గలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో వీఐపీల గుండెలు గుభేలుమన్నాయి. సెక్యూరిటీని కూడా తీసేస్తారేమోనని కొందరు భయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుదు స్పందించారు. వీఐపీల భద్రతను తగ్గించే ఆలోచన తమకు లేదని... భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంత మంది ముఖ్యమైన వ్యక్తులను రక్షించాల్సిన బాధ్యత ఉంటుందని... వారి రక్షణ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

More Telugu News