: మార్కెట్లోకి వచ్చిన కొత్త హ్యుందాయ్ కారు!

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మరో కొత్త కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. సెడాన్ వర్షన్ లో ఎక్సెంట్ కారును లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఎక్సెంట్ కారు ధర (ఎక్స్ షోరూం ఢిల్లీ) రూ. 5.38 లక్షల నుంచి రూ. 8.41 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ రెండు వర్షన్లలో ఇది లభిస్తుంది. మారుతి సుజుకి డిజైర్, ఫోక్స్ వాగన్ అమియో, హోండా అమేజ్ లకు ఎక్సెంట్ గట్టి పోటీ ఇస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈవో వైకే కూ తెలిపారు.   

More Telugu News