: 23 నుంచి ఏపీలోని పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు ఈ నెల 23వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని 301 కరవు మండలాల్లోని విద్యార్థులకు రేషన్ కూపన్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కూపన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 20, 21, 22 తేదీల్లో రేషన్, సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.

More Telugu News