: ఏపీ శాసనసభ కార్యదర్శిని తొలగించాలి: వైసీపీ

ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణను వెంటనే విధుల నుంచి తొలగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గత రెండేళ్ల నుంచి ఆయన విద్యార్హతలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాను కోరుతున్నప్పటికీ... శాసనసభ కార్యదర్శి మాత్రం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. సత్యనారాయణ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తగిన విద్యార్హతలు లేని వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. గవర్నర్, స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇప్పటికైనా ఈ విషయంలో వెంటనే కలగజేసుకోవాలని... హైకోర్టు తీర్పు రాకముందే సత్యనారాయణను తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతల గురించి రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు... ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

More Telugu News