: ఆ ట్రక్కు డ్రైవర్కి ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు
పాకిస్థాన్కు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్కి ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అతడి వయసు 70 ఏళ్లు కావడంతో తన కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నానని అంటున్నాడు. వివరాల్లోకి వెళితే, అబ్దుల్ మజీద్ మెంగాల్ అనే ఓ వ్యక్తి 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా కాలక్రమంలో మరో ఐదుగురిని వివాహం చేసుకుని ఏకంగా 54మంది పిల్లలకు తండ్రయ్యాడు. అయితే, ఆ పిల్లల్లో అనారోగ్యం కారణాల వల్ల 12 మంది మృతి చెందగా, ఆయన ఆరుగురు భార్యల్లో ఇద్దరు కన్నుమూశారు. తనకు ఇంతమంది పిల్లలు ఉండడంతో వారికి తిండిపెట్టలేకపోతున్నానని అబ్దుల్ మజీద్ మెంగాల్ అంటున్నాడు. ఓ సారి డబ్బు తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లి వచ్చేలోగా తన భార్య, ఓ పాప ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పాడు. తమ పిల్లల భవిష్యత్పై ఆందోళన చెందుతున్నానని అన్నాడు. తనకు ముందుగా జన్మించిన వారిలో కొంతమంది పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని చెప్పాడు.