: కొరియాతో భారీ డీల్ పై సంతకం చేయనున్న భారత్

మహాసముద్రాల్లో గనులను గుర్తించి, వాటి నుంచి ఖనిజాలను వెలికితీసుకువచ్చే భారీ ఓడల నిర్మాణానికి సంబంధించి దక్షిణ కొరియా రక్షణ సంస్థతో భారత్ ఓ చారిత్రాత్మక డీల్ ను కుదుర్చుకోనుంది. మొత్తం రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని భావిస్తున్నారు. గోవా షిప్ యార్డ్, సౌత్ కొరియా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, డిసెంబర్ లోగా డీల్ పై సంతకాలు జరుగుతాయని నేవీ యుద్ధ నౌకల ఉత్పత్తి, సేకరణ, నియంత్రణ విభాగం వైస్ అడ్మిరల్ డీఎం దేశ్ పాండే వెల్లడించారు.

న్యూఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఆయన, ల్యాండింగ్ ప్లాట్ ఫాం డాక్ లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఈ ఏడాదిలోనే ఖరారు చేయనున్నట్టు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే యుద్ధ నౌక రెండో దశ ప్రాజెక్టు కోసం నిధులను విడుదల చేయాలని రక్షణ శాఖను కోరామని, మరో 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కూడా నౌకాదళం యోచిస్తోందని వెల్లడించారు.

More Telugu News