: ‘నమస్తే గ్యాంగ్’ను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు

దోపిడీలకు పాల్పడుతున్న ‘నమస్తే గ్యాంగ్’ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ తుపాకులు, ఆభరణాలు, ఐదు ల్యాప్ టాప్ లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ కు చెందిన ‘నమస్తే గ్యాంగ్’ హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీలో పలు దోపిడీలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.

More Telugu News