: మోదీతో భేటీ అయిన అమెరికా భద్రతా సలహాదారు

ప్రధాని మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్ఆర్ మెక్ మాస్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ చర్చించారు. దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులపై కూడా మాట్లాడుకున్నారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్ కూడా హాజరయ్యారు.

అనంతరం ఎన్ఎస్ఏ అధికారి అజిత్ ధోవల్ తో కూడా మెక్ మాస్టర్ భేటీ అయి, పలు విషయాలపై చర్చించారు. భారత పర్యటనకు ముందే పాక్, ఆఫ్ఘనిస్థాన్ లలో మెక్ మాస్టర్ పర్యటించారు. 

More Telugu News