: చంద్రబాబుకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇంజినీరింగ్ చదివిన పితాని శివదుర్గా ప్రసాద్ (33) అనే యువకుడు ఈ నెల ఏడవ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా మర్రిపాలెం వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదువు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం మాత్రం దొరకలేదు. రెండేళ్ల క్రితం అతనికి పెళ్లయింది. కుటుంబాన్ని పోషించేందుకు చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. తాను చదువుకున్నా ఉద్యోగం రాలేదని... దీంతో తన భార్య కూడా తనను వదిలి వెళ్లిపోయిందని లేఖలో ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన యువకులు ఉపాధి దొరకక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని చెప్పాడు. అందరికీ ఉపాధి దొరకాలని... తనలా ఎవరూ చనిపోకూడదని రాశాడు. విశాఖ రైల్వే జోన్ కోసం అందరూ పోరాడాలని తెలిపాడు. రైల్వే జోన్ రాకతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పాడు