: ఈ విషయంలో చిరంజీవి, అల్లు అరవింద్, బన్నీ అభినందనీయులు: కల్యాణ్ రామ్

సంక్రాంతికి విడుదలై ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న చిత్రం 'శతమానం భవతి'. 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి'లాంటి భారీ సినిమాల మధ్య విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ లతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి సినిమా చేయాలంటూ తన భార్య కూడా కోరిందని చెప్పాడు. ఇంతటి గొప్ప సినిమాను నిర్మించిన దిల్ రాజుకు సన్మానం చేయాలనే ఆలోచన వచ్చినందుకు చిరంజీవి, అల్లు అరవింద్, బన్నీలకు అభినందలను తెలియజేస్తున్నానని అన్నాడు. 

More Telugu News