: మలప్పురం లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి మూడోస్థానం... గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి

కేరళలోని మలప్పురం లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అభ్యర్థి, పీకే కున్హాలీ కుట్టి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎల్డీఎఫ్ తరఫున పోటీ పడ్డ ఎంబీ ఫైసల్ పై 1.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నెల 12న ఇక్కడ ఎన్నిక జరుగగా, నేడు ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన శ్రీ ప్రకాష్, మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో మలప్పురం నుంచి గెలిచిన కేంద్ర మాజీ మంత్రి అహ్మద్ కన్నుమూయడంతో ఉప ఎన్నిక జరిగింది.

More Telugu News