: కంటతడి పెట్టిన నందమూరి హరికృష్ణ!

దేవినేని నెహ్రూ మరణ వార్త విన్న నందమూరి హరికృష్ణ కంటతడి పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి దేవినేనితో కలిసి పని చేసిన సందర్భాలను, ఆయనతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని హరికృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో దేవినేని తుదిశ్వాస విడిచిన విషయం తెలియగానే హరికృష్ణ హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్లారు.  

More Telugu News